17 April, 2026 | 12:10 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

23న డీఎస్సీ స్పోర్ట్స్ అభ్యర్థుల మహాధర్నా

22-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా ఫలితాలను విడుదల చేయాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాం డ్ చేసింది. గత ఆరు నెలల నుంచి తుది నివేదిక, ఫలితాలను విడుదల చేయకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని అభ్యర్థులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.

దీనికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నాను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలుగా సర్టిఫికెట్ వెరిఫి కేషన్‌ను చేపట్టిన అధికారులు తుది ఫలితాలను మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదని, వెంటనే వాటిని విడుదల చేయాలని అధికారులను అభ్యర్థు లు డిమాండ్ చేశారు.