calender_icon.png 22 June, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ 100వ ర్యాంక్ విద్యార్థిని ప్రియాంక‌ను అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

21-06-2025 10:58:29 PM

జేఈఈ అడ్వాన్స్ లో 657 ర్యాంకర్ శ్రీమాన్

న‌ల్ల‌గొండ టౌన్ (విజయక్రాంతి): ఇటీవ‌ల విడుద‌లైన నీట్ ఫ‌లితాల్లో న‌ల్ల‌గొండ ఎస్ ఆర్ కాలేజ్ కి చెందిన విద్యార్థిని బ‌చ్చు ప్రియాంక ఆలిండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించిన విషయం తెలిసేందే. శనివారం న‌ల్ల‌గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar) ఐపీఎస్ తన క్యాంప్ లో ఆఫీస్ లో బచ్చు ప్రియాంక నీట్ 100 ర్యాంక్ విద్యార్థితో పాటు లచ్చమల్ల మాన్ రాజ్ లని ఎస్పీ శాలువలుతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. ప్రియాంక, శ్రీ మాన్ రాజ్ తల్లితండ్రులను ప్రియాంక చదివిన ఎస్ ఆర్ కళాశాల యాజమాన్యంని అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ  రమేష్, డి.ఎస్.పి కె.శివరాం రెడ్డి ఎస్.ఆర్ కాలేజ్  నల్గొండ జోనల్ ఇంచార్జి దోనాల  శ్రీనివాసరెడ్డి ,అసిస్టెంట్ జోనల్  స‌తీశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.