సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి, మే 1 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలు, మున్సిపల్ వైఎస్ చైర్మన్ లతా విజేందర్రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు దాడి చేశారని ఆరోపించారు. బీజేపీతో కలిస్తే జోడీ.. లేదంటే ఈడీ దాడులంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోం దని ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మెదక్ బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ దాడులకు ఎవరూ భయపడరని, బీఆర్ఎస్ గెలుపు ఖాయమ ని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.