calender_icon.png 26 October, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునుగోడు అభివృద్ధికి కృషి

26-10-2025 12:00:00 AM

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చండూరు, అక్టోబర్ 25 ( విజయక్రాంతి ): మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు. శనివారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇడికుడ గ్రామం నుంచి ఘట్టుప్పల్ మండలం తెరట్‌పల్లి వరకు రూ.30 కోట్లతో రోడ్డు వెడల్పు నిర్మాణ పను లు, తాస్కాని గూడెం గ్రామం నుంచి చండూ రు టౌన్ వరకు రూ.13 కోట్ల వ్యయంతో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు, చండూరు పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

రోడ్డు వెడల్పు లో భాగంగా ఉన్నత పాఠశాల వద్ద అడ్డుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను అక్కడ నిర్మించిన డ్రైనేజీ కాలువను పరిశీలించారు. యజమానులతో మాట్లాడి అడ్డుగా ఉన్న షాపుల ని తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. చండూరు పట్టణంలో 2.90 కోట్ల వ్యయంతో శనిగచెరువు (చిన్న కుంట చెరువు ) సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి స్థానిక నాయకులతో కలిసి కట్టను చెరువును పరిశీలించారు.

మండలంలోని గుండ్రపల్లిలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగో పాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోల వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కొరిమి ఓంకారం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుజాత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.