14-06-2025 12:00:00 AM
ప్రశ్నిస్తున్న ప్రజలు.. వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న జనం
రోగులకు దండుకుంటున్న ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులు
ఖానాపూర్ (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పలు గ్రామాల్లో వైరల్ జ్వరాలు, డయేరియా విజృంభిస్తున్న, నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నాయని స్థానిక ప్రజా సం ఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఖానాపూర్ మున్సి పాలిటీ పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో, డయేరియా కేసులు చోటు చేసుకోవడం పలువు రిని కలవరపెడుతుంది.
ఈ నేపథ్యంలో ఖానాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కేంద్రంలో ప్రతిరోజు 10 కేసులకు పైచిలుకు డయేరియా కేసులు ఇన్ పేషెంట్లు, దాంతోపాటు జ్వరాలు, డయేరియా కేసులు ఓపి సుమారు 200 కు పైచిలుకు ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమై వారం రోజులు కాకున్నా పదుల సంఖ్యలో రోగులు ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. కాగా ఇటీవల వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని సుభాష్ నగర్, డబుల్ బెడ్ రూమ్ కాలనీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వదిలేశారు.
కాగా కలెక్టర్ చెప్తే గానీ వైద్య శిబిరాలు నిర్వహించరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు .ఈ నేపద్యంలో నియోజకవర్గంలోని పెంబి , కడం, దస్తురాబాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుత పరిస్థితి ఎపిడమిక్ గా మారక ముందే సిబ్బంది స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ, అర్ఫాద్ కాలనీ, విద్యానగర్, సాయి నగర్, సుభాష్ నగర్, ప్రాంతాల్లో శుక్రవారం కేసులు నమోదు అయినట్లు ఆసుపత్రి రికార్డులు నమోదయ్యాయి.
రోగులకు దండుకుంటున్న ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులు
ఇదే అదునుగా భావించి గ్రామాల్లో, పట్టణంలో ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులకు చికిత్స వల వేసి అడ్డగోలుగా దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ స్పందించి ప్రజల ను, రోగులను నిలువు దోపిడీ కాకుం డా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. వీరిని నియంత్రించి రోగులను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇదివరకే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో ఓపీ, ఇన్ పేషంట్ బెడ్స్ కిటకిటలాడుతున్నాయి.