14 July, 2026 | 6:54 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

సెలవుల మత్తులోనే విద్యుత్ అధికారులు

20-01-2026 02:14 AM

గజ్వేల్ డీఈఈ, ఎడిఈ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు, సిబ్బంది

గజ్వేల్, జనవరి 19: సంక్రాంతి సెలవులు పూర్తయినా గజ్వేల్ విద్యుత్ శాఖ అధికారులు అదే మత్తులో ఉండిపోయారు. గజ్వేల్ ఎడి కార్యాలయంలోనే ప్రస్తుతం డీఈ కార్యాలయం కూడా కొనసాగుతుంది. కార్యాలయంలో విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది ఉదయం 10.30 కావస్తున్నా హాజరు కాకపోగా, ముగ్గురు సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. కార్యాలయంలో తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినియోగదారులు అధికారులు సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగిపోవడం కనిపించింది. విధి నిర్వహణలో విద్యుత్ శాఖ అధికారుల తీరుకు వారి సమయపాలనే అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సరైన చర్యలు చేపట్టి సమయపాలన పాటించేలా అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.