13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సెలవుల మత్తులోనే విద్యుత్ అధికారులు

20-01-2026 02:14 AM

గజ్వేల్ డీఈఈ, ఎడిఈ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు, సిబ్బంది

గజ్వేల్, జనవరి 19: సంక్రాంతి సెలవులు పూర్తయినా గజ్వేల్ విద్యుత్ శాఖ అధికారులు అదే మత్తులో ఉండిపోయారు. గజ్వేల్ ఎడి కార్యాలయంలోనే ప్రస్తుతం డీఈ కార్యాలయం కూడా కొనసాగుతుంది. కార్యాలయంలో విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది ఉదయం 10.30 కావస్తున్నా హాజరు కాకపోగా, ముగ్గురు సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. కార్యాలయంలో తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినియోగదారులు అధికారులు సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగిపోవడం కనిపించింది. విధి నిర్వహణలో విద్యుత్ శాఖ అధికారుల తీరుకు వారి సమయపాలనే అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సరైన చర్యలు చేపట్టి సమయపాలన పాటించేలా అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.