27 March, 2026 | 4:42 AM

విద్యుత్ కార్మికుల ధర్నా

27-03-2026 02:34 AM

మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆర్టిజన్, అనుమ్యాన్, స్పాట్ బిల్లర్స్,పీస్ రేట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మహబూబాబాద్ జిల్లాలో గురువారం మహబూబాబా ద్, తొర్రూర్ డివిజన్ ఆఫీస్ ముందు మహా ధర్నా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా టి.ఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్మిక సంఘం చైర్మన్ ధరావత్ సికిందర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఒకే రూల్, ఒకే వ్యవస్థ అమలు చేయాలని ఆర్టిజన్ కార్మికులందరికీ కన్వర్షన్ ఏపీ ఎస్ ఈ బీ రూల్స్ వర్తింప చేయాలని, అన్ మ్యాన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం గా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొర్రూరు డివిజన్ చైర్మన్ ప సుపులేటి మధు, కన్వీనర్ బంధారపు శ్రీనివాస్, కో చైర్మన్ నాగరాజు, రమేష్, హరిప్రసాద్, ప్ర కాష్, వీరన్న, శ్రీను, వెంకన్న, ఎల్ల గౌడ్, జ్యోతి, సంధ్య, రవీందర్, రవికాంత్ పాల్గొన్నారు.