6 July, 2026 | 3:59 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

మాఘ అమావాస్య, మహా శివరాత్రి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష

17-01-2026 09:01 PM

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు దత్తత దేవాలయమైన శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానంలో నేడు ఆదివారం  జరగనున్న మాఘ అమావాస్య జాతర, రాబోయే మహా శివరాత్రిని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ఎల్. రమాదేవి ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, విద్యుత్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు.