03-12-2025 06:38:11 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): విద్యార్థుల్లో కృతజ్ఞత, సమానత్వ భావనలు పెంపొందించాలనే ఉద్దేశంతో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ప్రతిభా పోటీలో భాగంగా కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ట్రస్మా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లోని కోట రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో జరిగిన వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లో గణనీయ సంఖ్యలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
పూర్తయిన పరీక్షల ఫలితాలను బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. వ్యాసరచన విభాగంలో సరస్వతి శిశుమందిర్ పాఠశాల, కరీంనగర్ కు చెందిన బి. సాయి శ్రేష్ఠ ప్రథమ స్థానం, సరస్వతి పాఠశాల, వెలిచాలకు చెందినటువంటి నెట్టు సంజన ద్వితీయ స్థానం సాధించారు. వక్తృత్వ విభాగంలో పారామిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థి ఎ. సినీతిక ప్రథమ స్థానం, జెడ్పీహెచ్ఎస్ ఆసిఫ్నగర్ విద్యార్థి డి. లక్ష్మీ శ్లోక ద్వితీయ స్థానం గెలుచుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన ఈ నలుగురు విద్యార్థులు హైదరాబాద్లోని జీయర్ స్వామి ఆశ్రమంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీల్లో పాల్గొననున్నారు.