కుత్బుల్లాపూర్‌లో ఈటల ప్రచారం

02-05-2024 01:45:18 AM

మేడ్చల్, మే 1 (విజయ క్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ పాదయాత్రగా తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నేతలు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, శంకర్‌రెడ్డి, భరతసింహారెడ్డి, నందనం దివాకర్ తదితరులు పాల్గొన్నారు.