28 March, 2026 | 2:28 AM

అంతా రామమయం

28-03-2026 12:00 AM

ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు రామాలయాల్లో  వేడుకలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజాధి కార్యక్రమాలతో పాటు జానకి రాముని కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి.

అటు ఓల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల రామాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం వేద పండితుల  మంత్రోచ్ఛారణల నడుమ జ రిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలను తిలకించారు. అనంతరం తలంబ్రాల బుకింగ్ కౌంటర్ ను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు.  సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే దంపతులు స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.