14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

నీట్ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం

29-04-2025 12:20 AM

- సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్

 కొండపాక, ఏప్రిల్ 28: నీట్ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మే 4వ తేదీన యూజీ నీట్ పరీక్ష నిర్వహణకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, పకడ్బందీగా  నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.

పరీక్షా కేంద్రాలు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల లో నిర్వ హించనున్నామని, అధికారులను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చామని, విద్యార్థులకు ఎలాం టి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయాల ని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్, బేసిక్ మెడిసిన్స్ తో స్టాఫ్ నర్స్, ఆశ వర్కర్ తో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు.

పరీక్ష మధ్యాహ్నం 2 గంటలనుంచి, సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, పరీక్ష కేంద్రాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్, సిద్దిపేట ఆర్టీవో సదానందం, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, తదితరులు పాల్గొన్నారు.