04-06-2025 06:39:27 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ కు చెందిన బాదావత్ సంతోష్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 25 క్రికెట్ జట్టుకు ఎంపికైనట్లు మహబూబాద్ క్రికెట్ అసోసియేషన్(Mahabubabad Cricket Association) జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్ 25 క్రికెట్ 2 డేస్ లీగ్ టోర్నమెంట్లో ఆరు జిల్లాలు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, ములుగు పాల్గొనగా మహబూబాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన బాదావత్ సంతోష్ అత్యధికంగా 28 వికెట్లు సాధించి, ప్రతిభ చాటడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల కు చెందిన బాదావత్ సంతోష్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటి మానుకోట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అజయ్ సారధి రెడ్డి, కోచ్ వెతుకు కుమార్, సహాయ కోచ్ తోట వినయ్ కుమార్, తోటి క్రీడాకారులు అభినందిస్తూ ఆకాంక్షించారు.