11-06-2025 09:49:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవ సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 14 నిర్మల్ లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి(District Judge Srivani), సీనియర్ సివిల్ జడ్జి రాధిక(Senior Civil Judge Radhika) తెలిపారు. బుధవారం కోర్టు ఆవరణలో పోస్టర్లను ఆవిష్కరించి లోక్ అదాలత్ ప్రాధాన్యతను వివరించారు. చిన్నచిన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు రాజీమార్గం ద్వారా కృషి చేయడం జరుగుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.