calender_icon.png 10 June, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అసత్య ఆరోపణలు సరికాదు

10-06-2025 12:12:53 AM

తాడ్వాయి, జూన్9 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు ఐటిడిఎ ద్వారా అదనంగా 1500 ఇళ్లను పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర మంత్రి  సీతక్కకే దక్కుతుందనీ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రములోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజు మాట్లాడారు.

సీతక్క కీర్తిని పేరును ఓర్వలేని నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ములుగు జిల్లాలో 10 నుండి 12 క్వారీలు మాత్రమే నడుస్తున్నాయని అవీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం మాత్రమే ఇసుక రవాణా జరుగుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మేడారంలో ఇసుక దందా ఎక్కడ జరిగిందో ఆధారాలతో మాట్లాడాలని హెచ్చరించారు. 

ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదని అన్నారు. సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటేల్ , సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య , బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండీ ముజఫర్ ,తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర ,మాజీ ఎంపీపీ ఎనగంటి లక్ష్మయ్య , సింగిల్ విండో డైరెక్టర్లు యాణాల సిద్ది రెడ్డి , రంగరాబోయిన జగన్ , మండల నాయకులు గౌని మధు , నరసింగరావు తదితర నాయకులు పాల్గొన్నారు.