calender_icon.png 30 June, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ డ్యాంలో ఆకస్మికంగా మృతి చెందిన యువకుల కుటుంబాలను

30-06-2025 02:23:26 AM

పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిరిజ శెట్కర్

ఎల్లారెడ్డి జూన్ 29 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండలం లో, సోమార్పేట్ గ్రామ శివారులోని, నిజాంసాగర్ డ్యాంలో ఆకస్మికంగా మృతి చెందిన మృతుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిజా షెట్కర్ పరామర్శించారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమరిపేట గ్రామానికి చెందిన బెస్త హర్షవర్ధన్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన అయిత నవీన,అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన గుళ్ళ,గోవర్ధన్, బొగ్గు గుడిసె గ్రామానికి చెందిన మధుకర్ గౌడ్ గత నెల రోజుల క్రితం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ కాళీ ప్రదేశంలో క్రికెట్ ఆడుతూ అనుకోకుండా సాగర్లో స్నానం చేయడానికి వెళ్లి ఆకస్మికంగా ముగ్గురు మృతి చెందారు.

విషయం తెలుసుకున్న, టిపిసిసి ప్రధాన కార్యదర్శి, గిరిజ శెట్కార్ శనివారం నేరుగా వారి గ్రామాలకు వెళ్లి ఇంటింటికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి,ఆర్థిక సహాయం అందచేశారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనసభ్యులు మదన్ మోహన్ తో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం పొందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, పట్టణ పార్టీ అధ్యక్షుడు వినోద్ గౌడ్, మాజీ జెడ్పిటిసి సామెల్, కామారెడ్డి జిల్లా దిశా కమిటీ మెంబర్ దేశ్ ముక్ రాజు, ఆర్.ఎం.పి పిఎంపి జిల్లా అధ్యక్షుడు నిజ్జన విట్టల్, మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రాథమిక సహకార సంఘం ఎల్లారెడ్డి అధ్యక్షులు బొండ్ల సాయిలు, మాజీ ఎంపిటిసి మాచాపూర్ సంతోష్, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, శంకరయ్య, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.