30-06-2025 02:22:42 AM
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఆర్టీసీ యాజమాన్యం ఆషాఢ మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులు కేటాయిం చాలనే నిర్ణయానికి వచ్చింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు వేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాదు.. ఆర్టీసీ కార్మికులనే టూరిస్టు లుగా మారి, తాము పనిచేస్తున్న సంస్థలో బస్సులు బుక్ చేసుకుని వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ‘మీకు తెలిసిన వారిని టూర్ బస్సులు బుక్ చేసుకునేలా ఒప్పించండి.
లేదా మీరే సెలవులు తీసుకు ని మీ కుటుంబంతో కలిసి టూర్ వెళ్లండి.’ అని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పెంచే మార్గాలపై రాష్ట్రప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, కార్మికులే అద్దె చెల్లించి టూ ర్కు వెళ్లమని చెప్పడం సరికాదని వారు వాపోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ యాజమాన్యానికి నేరుగా వచ్చే ఆదాయం తగ్గుతున్నదనేది వాస్తవం.
ఆ ఆదాయాన్ని భర్తీ చేసేందుకు యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. దీనిలో భాగంగానే హైదరాబాద్లో మెట్రో డీలక్స్, జిల్లాల్లో సెమీ డీలక్స్ బస్సుల్లో మహిళల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నది. అయినప్పటికీ.. వాటి ద్వారా పెద్దగా ఆదాయమేమీ రావడం లేదు. దీంతో యాజమాన్యం తాజాగా మరో ఆలోచన చేసింది.