calender_icon.png 30 May, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షంతో రైతన్న అతలాకుతలం!

29-05-2025 02:19:32 AM

-వారం రోజులుగా కురుస్తున్న వర్షం 

-రోడ్ సైడ్ ఆరబోసిన ధాన్యం 

-మొక్కజొన్న తడిసిపోయిన వైనం

-లబో దిబో మంటున్న రైతులు

------జుక్కల్, మే 28 (విజయక్రాంతి) : గత వారం రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతన్నలు తీవ్ర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి మొక్కజొన్న పంటలు చేతికొచ్చిన తర్వాత రోడ్ సైడ్ కు ఆరబోసేందుకు వంచదా వారం రోజుల నుంచి వర్షం వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని వరి సంచులు నింపి ఉంచిన తర్వాత కాంటాక్ట్ చేయకపోవడం వల్ల కూడా కుప్పలుగా రోడ్‌సైడ్‌కే ఉన్నాయని వాపోతు న్నారు. మరికొన్ని వరి గొప్పలు తడిసిపోయి ముద్దాయ్యయని చెబుతున్నారు. ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షంతో రైతులు తీవ్ర నష్టపోతున్నామని పేర్కొంటున్నారు.

తడిసిపోయిన వారి మొక్కజొన్న పంటలు కొనుగోలు కేంద్రాల్లో కొంటారా లేదా అని సమస్య కూడా వెంటాడుతుందని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మైయ్చర్ లేదని మరి కొన్నిసార్లు సంచులు దొరకడం లేదంటూ సాకులు చెబుతున్నారని అంటున్నారు.

గత వారం రోజులు కురిసిన వర్షంతో పంటలు మొత్తం పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయని వాపోతున్నారు. దీంతో రైతులు ఏమి చేయని దిక్కుతోచని పరిస్థితిలో లబోదిబో అంటూ వరుణుడు కరుణించాలని వారు ఆకాశం వైపు చూస్తున్నారు. తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత అగ్రికల్చర్ అధికారులు పంట నష్టం జరిగిన రైతులకు సర్వే చేసి పంట నష్టపరిహారం అందే విధం గా చూడాలని రైతులకు కోరుతున్నారు. ఈ విషయంపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు గాని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గాని స్పందించాలని వేడుకుంటున్నారు.

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి 

తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనడం లేదు. దీంతోతీవ్రంగా రైతులు  నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యానికి డబ్బులు చెల్లించాలి.

 అరుణ్ ,రైతు,  కంటాలి గ్రామం, జుక్కల్ మండలం

వర్షంతో తీవ్రంగా నష్టపోతున్నాం 

గత వారం రోజులుగా కూర్చున్న వర్షాలతో వరి ధాన్యాన్ని అమ్మేందుకు ఆరబెట్టగా వర్షానికి తడిసి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పినా కొనడం లేదు. రైతులు నష్టపోతున్నారు.

 మొగులాజి, రైతు, జుక్కల్