04-06-2025 11:20:37 PM
అన్ని రంగాలలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం..
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్నదాతలే కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. బుధవారం మండల పరిధిలోని కుంచమర్తి గ్రామ పాఠశాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో రైతన్నల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని తదుపరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్య పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సామ అభిషేక్ రెడ్డి, ఉమ్మడి మండల పిఎసిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి, ఇందుర్తి వెంకట్ రెడ్డి, దలువాయి రేఖ శ్రీధర్, తహసిల్దార్ బాషపంగు శ్రీకాంత్, ఎంపీడీవో గోపి, నాయబ్ తహశీల్దార్ యాదగిరి, ఆరైలు జలంధర్ రావు, వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ జానీమియా, జానీపాషా, అమీనుద్దీన్, ఉగం లింగరాజు, రమేష్, అనిల్, మల్లారెడ్డి, జానయ్య, సైదిరెడ్డి, పలువురు కార్యాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.