calender_icon.png 7 June, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

05-06-2025 12:00:00 AM

డిప్యూటీ సీఎం దత్తత గ్రామంలో ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ రాజర్షిషా భూమి పూజ

ఆదిలాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన తర్వాత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా  అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎన్నికల సందర్భంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో దత్తత తీసుకున్న బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఇళ్ళ నిర్మాణానికి బుధవారం జిల్లా కలెక్టర్ భూమి పూజ చేశారు.

అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు ప్రొసిడింగ్ కాపీ లు అందజేశారు. అంతకుముందు గ్రామం లో చేపట్టిన  భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించి, రైతులు అందించే దరఖా స్తులపై అరా తీశారు.  ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద వారి సొంత ఇంటి కల సహకారం చేసేందుకు ఈ ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్న ద్రుడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.

భూమిపూజ చేసుకున్న తరువాత వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని, మద్యలో పనులు ఆపకుండా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆన్నారు. విడతల వారిగా డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నా రు. ఇందిరమ్మ ఇళ్లు రానివారికి తప్పకుండా వస్తాయని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేసి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన అన్నిటికీ డబ్బు లు వెంటనే ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆర్.యస్.ఈ.టి.ఐ ఆద్వర్యంలో నిర్వహించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ లో భాగంగా ఉమెన్స్ టైలర్ శిక్షణా పొందిన 35 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి, కిట్లు పంపిణి చేశారు. 

నేర్చుకున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, మంచి బిజినెస్ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్, ఇండస్ట్రీ డీఎం పద్మ భూషణ్, ఉత్తం కుమార్,  డైరెక్టర్ మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.