24-06-2025 09:01:54 PM
మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంథనిని రాష్ట్రంలోనే అగ్రశ్రేణిలో నిలుపుతాం..
ప్రభుత్వాన్ని విమర్శించే వారు పిచ్చి మాటలు మానుకోవాలి..
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం..
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారంలో ఘనంగా రైతు భరోసా పండగ సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం(District Congress Vice President Choppari Sadanandam) ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసిన సందర్భంగా రైతు భరోసా పండుగ సంబరాలు నిర్వహించి, బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ... ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో మంథని నియోజక వర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న దృఢ నిశ్చయంతో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారని అన్నారు.
కానీ కొందరు ఉనికి కోసం పిచ్చి పట్టిన కోతిలా వ్యవహరిస్తూ మంత్రి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక విమర్శిస్తున్నారని అలాంటి కబోధులకు అభివృద్ధి కనబడదని, అట్టివారిని పట్టించుకోనక్కర్లేదని ఇదివరకే మంథని ప్రజలు వారిని మరిచారన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్, ముత్తారం తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బియ్యని శివకుమార్, మాజీ ఎంపీటీసీ నెత్తెట్ల భారతలక్ష్మి– కొమురయ్య, దాసరి చంద్రమొగిలి ,అకోజు అశోక్,గడ్డం శశికుమార్, రాపెళ్లి రాజయ్య, బియ్యని రాజబాబు, మదాసీ రాజయ్య,కొంకటి మల్లయ్య, చిందాం సదానందం, అనుము గోపి ,కాశివొజ్జుల చారి, నర్ర మల్లయ్య, కల్వచెర్ల రాజు, అనుము ప్రశాంత్, నేతెట్ల కిరణ్, లక్కం రాజు, సతీష్ ఆయాగ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.