రైతులు పంటల సాగులో అధునాతన పద్ధతులు పాటించాలి
30-03-2026 09:37 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): రైతులు పంటల సాగులో అధునాతన పద్ధతులు పాటించాలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలోని హుజూర్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం తరఫున నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం మండలంలోని పొనుగోడు రైతు విజ్ఞాన కేంద్రం తరఫున పంట వైవిద్యేకరణకు ప్రభుత్వం కల్పించాల్సిన వసతులను వరి కాకుండా ఇతర పంటల సాగు కోసం కావలసిన అధునాతన పద్ధతులను అవగాహన కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటికం వేణు, వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్, ఏఈఓ మనోజ్, పిఎసిఎస్ సీఈవో ఉపేందర్, రైతులు పాల్గొన్నారు.




