‘బొక్కస్గాం’ను చుట్టుముట్టిన రైతులు
28-05-2026 02:08 AM
సిర్గాపూర్, మే 27: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని బొక్కస్గాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని రైతులు చుట్టుముట్టారు. స్థానికంగా వరి ధాన్యం కొనుగోలు బాధ్యతను ఐకేపీ కేంద్రానికి అప్పగించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పిఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలోనే అన్ని పంటలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తమ సొసైటీకి కాకుండా ఐకేపీకి బాధ్యతలు అప్పగించడం సరికాదని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పిఎసిఎస్, ఐకెపికి చెందిన ఇరువర్గాలు ఒకరి పై ఒకరు ఘర్షణకు దిగే సమయంలో పోలీసులు ఇరువర్గాలను చెదారగొట్టారు.






