22-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 21 (విజయక్రాంతి) : డబ్బుల కోసం నిత్యం వేధిస్తుండడంతో ఉద్దేశ్యపూర్వకంగానే కొడుకును తలపై కొట్టి తండ్రి హత్య చేశాడని కామారెడ్డి సబ్ డివిజనల్, ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ రెండు నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు.
అయితే వచ్చినప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసైన నిఖిల్ ప్రతిరోజూ డబ్బుల కోసం తండ్రిని వేధించేవా డు. వేధింపులు భరించలేక ఈనెల 19న నిఖిల్ను తండ్రి బాలరాజు రాడ్డుతో నిఖిల్ తలపై కొట్టి హత్య చేశాడు. కొడుకును హత్య చేసిన బాలరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సు రాజు పాల్గొన్నారు.