26 April, 2026 | 5:12 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

50మంది విద్యార్థినులకు అస్వస్థత

26-06-2024 01:45 AM

ఆరుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా దక్షిత సమితి విద్యాసంస్థలకు చెందిన బన్సీలాల్ మలానీ నర్సింగ్ కాలేజీలో మంగళవారం పాడైపోయిన ఆహారం తిని 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. యాజమాన్యం వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. దీనిపై యాజమాన్యాన్ని వివరణ కోరగా.. విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ కాలేదని, కలుషిత నీటితో వారు అస్వస్థతకు గురయ్యారని సమాధానమిచ్చారు. దీనిపై  జలమండలి మియాపూర్ ఏరియా అధికారి నాగప్రియను వివరణ కోరగా.. కలుషిత నీటి సరఫరా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ఫుడ్ సేఫ్టీ అధికారి హృదయని వివరణ కోరగా.. సదరు హాస్టల్‌లో తనిఖీ చేసి నిజానిజాలు వెలికి తీస్తామన్నారు.