15-07-2025 12:39:36 AM
ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాం తి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్ స్టీరింగ్ కమిటీ సమావేశం దోమలగూడలోని టీయస్యుటీఎఫ్ కార్యాలయం లో ఎం. సోమయ్య అధ్యక్షతన జరిగింది. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎ. వెంకట్, చకినాల అనిల్కుమార్, నన్నెబోయిన తిరుపతి, టి. లింగారెడ్డి, యస్. హరికిషన్, బి. కొండయ్య, యం. సైదులు, డి. రాజయ్య లు పాల్గొన్నారు.
యుయస్పిసి స్టీరింగ్ కమిటి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేసి, ఈనెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని యుయస్పిసి డిమాండ్ చేసింది.
నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు. ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. సమస్యల పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుయస్పిసి తీర్మానిచింది.
ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. జులై 23, 24 తేదీలలో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ర్ట ముఖ్యమంత్రికి మెమోరాండాలు, ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 23న హైదరాబాద్లో రాష్ర్ట స్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.