15 April, 2026 | 12:51 AM

అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ఆది

05-05-2025 12:42 AM

గద్వాల, మే 04 ( విజయక్రాంతి ) : 5 వ శక్తి పీఠం అయిన అలంపూర్ పుణ్యక్షేత్రం ను ఆదివారం సినీ నటుడు ఆది సాయి కుమార్ దంపతులు దర్శించుకన్నారు. ముందుగా ఆలయ అర్చకులు సినీ నటుడు ఆది సాయి కుమార్ దంపతులను ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం జోగులాంబ అమ్మవారికి, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలను చేశారు.  అనంతరం నటుడు ఆది సాయి కుమార్ దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి  ఆర్. పురేందర్ కుమార్ ప్రత్యేకం గా సన్మానించారు.