13-10-2025 10:09:02 PM
ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్ చెరు: విద్యార్థి దశ నుండి క్రీడల పట్ల ప్రోత్సాహం అందిస్తే, అద్భుతమైన విజయాలు సాధిస్తారని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతున్న ఇద్దరు క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆర్థిక సహకారం అందించి వారి ప్రతిభను ప్రోత్సహించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉషూ(కిక్ బాక్సింగ్) రాష్ట్ర స్థాయి పోటీల్లో బీరంగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎం. అశ్విని అండర్-17 విభాగంలో బంగారు పతకం సాధించింది. త్వరలో కాశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రుత్విక రెడ్డి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా స్థాయి షటిల్ బ్యాట్మెంటన్ పోటీల్లో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ మేరకు సోమవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అశ్వినికి 30 వేల రూపాయలు, రుత్విక రెడ్డికి 40 వేల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగైన ప్రదర్శనతో జాతీయ స్థాయిలో పటాన్చెరు పేరును నిలబెట్టాలని కోరారు. క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులను క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత, ఫిజికల్ డైరెక్టర్ అమూల్యను ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందించారు.