30 March, 2026 | 1:27 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

'డ్రంక్ అండ్ డ్రైవ్'.. రూ.41 వేలు ఫైన్

09-12-2025 07:37 PM

సిద్దిపేట క్రైం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన నలుగురికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు రూ.41 వేలు జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆయన సిబ్బందితో సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నట్టు చెప్పారు. వారిని బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా, మద్యం తాగినట్టు రిపోర్ట్ రావడంతో మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. న్యాయమూర్తి విచారణ జరిపి వారికి జరిమానా విధించారని చెప్పారు.