24-06-2025 12:20:30 AM
ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ జూన్ 23 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేసి చూపిస్తానంటూ స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి ప్రతేక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు.
అనంతరం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు తోపాటు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్ నియోజకవర్గంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దల అనుగ్రహంతో అభివృద్ధి చేసి చూపిస్తానంటూ పేర్కొన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అంశాల్లో ప్రత్యేక చర్యలు చేపడతానని మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉంటాననితెలిపారు.