24-06-2025 12:21:00 AM
కోదాడ జూన్ 23 : కోదాడ పట్టణంలో ని గుడిబండ రోడ్డులో గోపిరెడ్డి నగర్ కు వెళ్లే చౌరస్తాలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమును సోమవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం చౌరస్తాకు వైఎస్ఆర్ చౌరస్తాగా నామకరణం చేశారు. మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,19వ వార్డు తాజా మాజీ కౌన్సిలర కొల్ల లక్ష్మి ప్రసన్న కోటిరెడ్డి, అంచూరి వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, బాలకోటిరెడ్డి, మాలాద్రి రెడ్డి కామేశ్వర్ రెడ్డి, ఆర్. వీరారెడ్డి, పి. వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరామిరెడ్డి, మహానంద రెడ్డి పాల్గొన్నారు .