10 April, 2026 | 5:44 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి   •   బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి   •   తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •  

ఐదు రోజులు వర్షాలు

26-10-2025 01:09 AM
  1. వాతావరణ కేంద్రం అంచనా 
  2. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆగ్నే య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం ఉదయానికి ‘మొంథా’ తుఫానుగా మారే అవకాశముంది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా పడనుంది.

తెలంగాణలో ఆదివారం అన్ని జిల్లా లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దాంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో.. 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షా లు కురిసే అవకాశం ఉంది.