10 April, 2026 | 3:57 PM

Breaking News

అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •  

ఏ పదవీ లేనోళ్లకే డీసీసీ?

26-10-2025 01:08 AM
  1. ఈ నెల 29న లేదా నవంబర్ మొదటి వారంలో ప్రకటన 
  2. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం, 
  3. డిప్యూటీ సీఎం భేటీ 
  4. డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చ 
  5. పరిశీలకులు ఇచ్చిన నివేదికపై కసరత్తు

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో ఏ పదవీ లేని వారికే డీసీసీ పీఠం కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రభుత్వంలో, పార్టీలో పలు పదవుల్లో ఉన్న వారికి కాకుండా ఏ పదవీ లేనివారికి, సామాజిక సమీకరణాలు, నేతల శక్తి సామర్థ్యాలను చూసి డీసీసీ పదవులు ఇవ్వాలని కసరత్తు చేస్తున్నట్లు తెలు స్తోంది.

ఇందులో భాగంగానే  ఢిల్లీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఈనెల 29న లేదా నవంబర్ మొదటి వారంలో డీసీసీల ఎంపికకు సంబంధించిన ప్రకటనను చేయనున్నారు. ఈ భేటీలో ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీసీసీల ఎంపికపై నేతల నుంచి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా ఏఐసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికపై కసరత్తు చేశారు. అయితే పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకోవడంతో అబ్జర్వర్ల నివేదికలపై దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ నేతలతో కేసీ.వేణుగోపాల్ చర్చించారు. అనంతరం ఒక్కో నేతతో వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయి వారి అభిప్రాయాలను విడి విడిగా తీసుకున్నారు. వివిధ సామాజిక వర్గాలకు డీసీసీ పదవుల్లో అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.