26-10-2025 12:36:35 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ చేపట్టిన ‘సామాజిక చైతన్య రథయాత్ర’ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్కర్నూల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలి, తెలంగాణను ఏలుకోవాలని పిలుపునిచ్చారు.
“తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది, రెండో దశ ఉద్యమం లో 1200 మంది చేసిన ఆత్మబలి దానాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక తెలంగాణగానే మిగిలిపోవడం, బహుజనులకు అధికార పగ్గాలు అందకపోవడం ఎంతో బాధాకరం” అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఉన్న 26 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
అకాలవర్షాలకారణంగా భారీగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకు లతో పాటు టీఆర్ఎల్డీ రాష్ట్ర నాయకులు మల్లేష్ ముద్దం, రిషబ్ జైన్, జాని, నరసింహరావు, సుధాకర్ పాల్గొన్నారు. బుల్లెట్ వెంక న్న కళా బృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.