calender_icon.png 28 October, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు

22-10-2025 12:33:54 AM

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

కోరుట్ల అక్టోబర్ 21(విజయక్రాంతి): దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు శుభవార్తను అం దించారు.ఈరోజే ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు కావడం ధ ర్మపురి యువతకు కొత్త భవిష్యత్తు దిశ చూ పుతుంది.

ఇకపై ఉన్నత విద్య కోసం ఇతర పట్టణాలకు వలస అవసరం ఉండదు అని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, ధర్మపు రి ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు.విద్యా రంగ అభివృద్ధికి ప్రాధా న్యం ఇస్తున్నామనిప్రజల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి విద్య, ఉపాధి రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం అన్నారు. ధ ర్మారం మండలంలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి భూమిపూజ ఇప్పటికే నిర్వహించా మని. నేరేళ్ల గ్రామం వద్ద సుమారు 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మా ణం చేపట్టబోతున్నామన్నారు.

ఎందరో మే ధావులు, కవులు, వేదపండితులను తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళా శాలను పునఃప్రారంభించామని అదనంగా ధర్మపురి ప్రాంత యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి యూత్ ట్రైనింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఇ-క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.సంక్షేమం, సమగ్రాభివృద్ధి, సమానత్వం ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ మూడుప్రధాన స్తంభాలు. ప్రజలకు వాస్తవ మార్పు కనిపించేటట్లు కృషి చేస్తున్నా మనిపేర్కొన్నారు.