18-08-2025 07:56:07 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): చెరువు అనుకుంటే పొరపడినట్టే అవి వరి పంట పొలాలు. ఇది ఎక్కడో కాదండి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో గత రాత్రి కురిసిన అతి నుంచి అతి భారీ వర్షానికి పంట పొలాల్లో నీరు చేరడంతో పూర్తిగా పంట నీట మునగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో నష్టపోడం జరిగిందని రైతన్నలు వాపోతున్నారు.