మున్నేరు వాగుకు వరద ఉద్ధృతి.. జలదిగ్బంధంలో కాలనీలు
ఖమ్మం: ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మంలోని మున్నేరు వరద ఉద్ధృతిలో పరివాహక పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహాకల్ప, వెంకటేశ్వర నగర్, మోతీనర్, బొక్కలగుడ్డ కాలనీలు నీట మునగడంతో స్థానికులు ఇళ్లపైకి చేరుకున్నారు. వరద చట్టుముట్టిన ఇళ్ల నుంచి రక్షించాలని బాధితుల ఆర్తనాదాలు చేస్తున్న వందలాది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా... తిరుమలాయపాలెం మండలం రాకాసితండా జలదిగ్బంధం అయ్యాయి. ఆకేరు వాగు వరద నీరు మొత్తం రాకాసితండాను చుట్టుముట్టింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బందృాలు రాకాసి తండాకు చేరుకుని తండావాసులను కాపాడేందుకు యత్నిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ చర్యలు సాధ్యపడడం లేదని వెల్లడించిన అధికారులు తండావాసులను బోట్ల సహయంతో కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.






