20-06-2025 12:28:36 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, జూన్ 19: పాఠశాలల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పాఠశాలల పరిశు భ్రత,మధ్యాహ్న భోజన పథకం అమలు, తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారు లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాఠశాలలు పునః ప్రారంభం కావడం ,అలాగే వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా పాఠశాలల్లోపరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి జిల్లాలోని అన్ని పాఠశాలలు ,అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో పరిశుభ్రత లోపం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఇం చార్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ , రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఎమ్ ఎస్వోలు, ఇతర అధికారులు, ఈ టెలీ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .