16-07-2025 01:02:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో మంగళవారం ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణ లో సుమారు 900 మంది పేద రోగుల సహాయకులకు అన్నదానం చేశారు.
కార్యక్రమంలో డెస్టినీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనే జింగ్ డైరెక్టర్ సయ్యద్ మగ్ఫూర్ బుఖారి హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్య క్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ముకీమ్ ఖురేషి, ఎ.వి. శ్రీధర్, టీఎన్జీవో ఎంఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బి శివకుమార్,
మిత్రుల రిజిస్ట్రేషన్ శాఖ నసీరుద్దీన్, డీఈవో ఆఫీస్ సుదర్శన్, హైదరా బాద్ జిల్లా ఏపీఆర్ఓ మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్, మహ్మద్ హబీబ్ ముకీమ్ పాలుగున్నారు. ముజీబ్ మాట్లాడుతూ.. కీర్తిశేషులైన తల్లిదండ్రుల పేరు మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు.