26 April, 2026 | 9:33 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

భూదోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్

21-12-2024 01:50 AM

భూభారతి చట్టం.. ప్రతిఒక్కరికీ చుట్టం

ఆర్వోఆర్- 2024 బిల్లు చట్టంగా మారితే, ధరణి ముసుగులో తాము చేసిన బాగోతాలు ఎక్కడ బయటపడతాయేమోనన్న భయంతో బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీలో అరాచకానికి పాల్పడ్డారు. వారి తప్పులు బయటపడితే తెలంగాణ ప్రజలు భవిష్యత్‌లో వారిని రాష్ట్రంలో ఉండనీయరన్న ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని ఆమోదించకుండా అడ్డుకున్నారు.

సహచర సభ్యులు మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సభలో ఏదిచేసినా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, చెల్లుబాటు అవుతుందన్న ఆలోచనతో వారు వ్యవహరిస్తున్నారు. ఐదు రోజులుగా బీఆర్‌ఎస్ సభ్యులు అబద్ధాలతో సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూభారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. బిల్లుకు ఆమోదం లభించడంతో నా జన్మ ధన్యమైంది. 

  రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి