23-07-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూలై 22 (విజయ క్రాంతి): నగరంలోని 33వ డివిజన్ భగత్ నగర్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని మంగళవారం మాజీ మేయర్ వై.సునీల్ రావు సందర్శించి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోలకాని నర్సయ్య, ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజు, సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి పరి శీలించి తగు సూచనలు,సలహాలుచేశారు.