కాంగ్రెస్ పేదల పార్టీ

08-05-2024 02:17:00 AM

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి

ఆదిలాబాద్, మే 7 (విజయక్రాంతి): ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి ఆదిలాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ముమ్మర ప్రచారం చేపట్టారు. పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంగళవారం ఆదిలాబాద్ పట్టణంతో పాటు బేల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేద వర్గాల సంక్షేమానికి పాటుపడే పార్టీ అని అన్నారు. ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. అనంతరం పలువురు మహిళలు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, నాయకులు ఫైజుల్లా ఖాన్, రాందాస్ నాక్లే, వామన్ వాంఖడే, సుదాం రెడ్డి, నగేష్ రెడ్డి,  మల్లారెడ్డి, రాజా రెడ్డి, రూపేష్ రెడ్డి పాల్గొన్నారు.