అబద్ధాల బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నమ్మొద్దు

08-05-2024 02:13:21 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, మే 7 (విజయక్రాంతి): కేంద్రం లో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకున్నారే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని, అలాంటి పార్టీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎండీ రహీం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక పథకాలను అమలు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్, పీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజుద్దీన్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు  విజయ్ చందర్ పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ కౌన్సిలర్..

జిల్లా కేంద్రంలోని 27వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.