వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర
25-07-2026 04:19 PM
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఆషాడ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.






