13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే

14-01-2026 12:45 AM

మద్నూర్, జనవరి 13 (విజయ క్రాంతి): మద్నూర్ మండలం రాచుర్ గ్రామానికి చెందిన కల్లప్ప పటేల్  ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న  జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  రాచుర్ గ్రామానికి వెళ్లి కల్లప్ప పటేల్ కుటుంబ స భ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ...కల్లప్ప పటేల్  అకాల మరణం కుటుంబానికి తీరని లోటు అని, ఈ దుఃఖ సమయంలో బి ఆర్ యస్ పార్టీ ఎల్లప్పుడూ కల్లప్ప కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో మద్నూర్ మండల బి ఆర్ స్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, బిచ్కుంద మాజీ సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ  తదితరులు  పాల్గొన్నారు.