16 April, 2026 | 6:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

17-11-2025 12:00 AM

బిచ్కుంద, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన BRS మాజీ ఉప సర్పంచ్ బద్ది రాజు గత వారం  గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  ఆదివారం బండపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులతో మాటలాడి ధైర్యం చెప్పారు, బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటుంది అన్నారు.

ఈ కష్టసమయంలో దేవుడు శక్తి, సహనం ప్రసాదించాలని ప్రార్థించారు. బద్ది రాజు  సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్ రెడ్డి, గుంటి రాములు, బర్షం శ్రీకాంత్, సొసైటీ రాములు, కుమ్మరి తుకారాం, కొంగల చిన్న సాయిలు, గొల్ల అంజయ్య, సురేష్ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.