30-05-2025 05:12:34 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలోనే ప్రసిద్ధి గాంచిన గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్కలను మాజీ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకున్నారు. అంతకు ముందుగా భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మేడారంలో లో సమ్మక్క సారక్కలకు మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నంది రెడ్డి తదితరులు ఉన్నారు.