calender_icon.png 7 June, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన కొండమల్లేపల్లి మండల మాజీ ఎంపీపీ

06-06-2025 09:24:21 AM

దేవరకొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నల్లగొండ రోడ్డులో గుమ్మడవల్లి గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన పీజేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను గురువారం మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన పెట్రోల్‌, డీజిల్‌ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దబావి జనార్దన్ రెడ్డి పద్మావతి, అభిలాష్ రెడ్డి మాధురి, శివనంద రెడ్డి స్నేహ దంపతులతో పాటు ప్రముఖ పురోహితులు వైద్యుల కృష్ణమూర్తి, అనంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి కాసర్ల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ బోడ యాదయ్య యాదవ్, పంపాటి శ్రీధర్, చెట్లపల్లి శ్రీనివాస్, మంచికంటి జగన్మోహన్, బండారు రాము, బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్, గంధం సురేష్, మంగ్యా నాయక్, స్వామి, మున్నా, బొడ్డుపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.