మంత్రి రాజ్నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి
18-09-2025 05:15 PM
హైదరాబాద్: హైదరాబాద్ లో బుధవారం జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh), పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు బీజేపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మీర్ ఫిరసాత్ అలీ బక్రీ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కూడా స్వాగతం పలికారు.




