25-06-2025 08:33:53 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): కాల్వ శ్రీరాంపూర్ మండలం(Kalva Srirampur Mandal)లోని పాండవుల గుట్ట సమీపంలో నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయానికి కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి తనవంతుగా ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విలువ చేసే ఇటుక లోడును బుధవారం అందజేశారు. పాండవుల గుట్ట సమీపంలో జరిగే ఆలయ నిర్మాణ పనులను జడ్పీటీసీ సందర్శించారు. ఆలయ నిర్మాణానికి ఇటుకను అందజేసిన తిరుపతిరెడ్డికి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడెపు రాజు, ఓరుగంటి కొమురయ్య, పెద్దిరెడ్డి వీరారెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్, ఉప్పుల కుమార్, తాత రవి, స్వామి తదితరులు ఉన్నారు.